ఉద్యోగులకు DA బకాయిల చెల్లింపు
మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డీఏ (Dearness Allowance) బకాయిల చెల్లింపునకు సుమారు ₹800 కోట్ల ను ఆమోదించింది. ఈ చెల్లింపులు నోవంబర్, డిసెంబర్ 2025, మరియు జనవరి 2026 నెలలకు సంబంధించినవి. ఈ బకాయిలను మే 2026లో ఉద్యోగుల జీతంతో పాటు చెల్లించనున్నారు.
పెన్షన్ రిలీఫ్, NPS మార్పులు
ఇది మాత్రమే కాదు, పదవీ విరమణ చేసిన ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు జనవరి 1, 2026 నుంచి డీఏ రిలీఫ్ (DR) 2% పెరగనుంది. దీంతో వారి డీఏ రిలీఫ్ 60% కి చేరుతుంది. ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో కూడా కొన్ని కీలక మార్పులను తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు డిసెంబర్ 31, 2026 లోపు కొత్త NPS స్కీమ్ను ఎంచుకోవచ్చు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్వర్క్లో, ఉద్యోగులు తమ రిటైర్మెంట్ కార్పస్లో 60% మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 40% ను యాన్యుటీలలోకి వెళ్తుంది. ఇది రాష్ట్ర పెన్షన్ చెల్లింపులను ప్రభావితం చేస్తుంది. ఉద్యోగులు కొన్ని షరతులకు లోబడి NPS కార్పస్ నుంచి ముందస్తు ఉపసంహరణలు కూడా చేసుకోవచ్చు. అయితే, ఆ మొత్తాన్ని 10% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
