2027, జనవరి 1 నుంచి IRDAI కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు డిజిటల్ వ్యవస్థలను వేగవంతం చేస్తున్నాయి. పాలసీ ట్రాకబిలిటీ (Traceability) కోసం తీసుకొస్తున్న ఈ మార్పులు, ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఇప్పుడు బీమా రంగంలో చర్చనీయాంశంగా మారాయి. 2027, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న 'ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీస్ (అమెండ్మెంట్) రెగ్యులేషన్స్' ప్రకారం, ప్రతి పాలసీ అమ్మకం వెనుక పూర్తి పారదర్శకత ఉండాలి. అంటే, పాలసీని ఎవరు విక్రయించారో, ఎవరు సర్వీస్ చేస్తున్నారో స్పష్టంగా తెలిసేలా 'పాలసీ-లెవల్ ట్రేసబిలిటీ'ని కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలి.
డిజిటల్ బాటలో దిగ్గజాలు
ఈ నిబంధనలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారీగా అప్గ్రేడ్ చేస్తున్నాయి.
- ICICI Prudential Life Insurance: ఇప్పటికే 99% వ్యాపార అప్లికేషన్లను డిజిటల్గా ప్రాసెస్ చేస్తోంది. గడిచిన క్వార్టర్ లో 27 మిలియన్ల డిజిటల్ ఇంటరాక్షన్స్ నమోదయ్యాయి.
- SBI Life Insurance: దాదాపు 99.7% వ్యక్తిగత ప్రతిపాదనలను డిజిటల్గా స్వీకరిస్తోంది. ఇందులో 57% పాలసీలను ఆటోమేటెడ్ అండర్ రైటింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం గమనార్హం.
- HDFC Life: తన 'ప్రాజెక్ట్ INSPIRE' ద్వారా AI మరియు ఆటోమేషన్ టెక్నాలజీని ఉపయోగించి క్లెయిమ్ సెటిల్మెంట్, పాలసీ ఇష్యూ ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం
ఈ డిజిటల్ మార్పుల వల్ల కంపెనీల ఆపరేషనల్ ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, కంప్లైయన్స్ (Compliance) కోసం చేసే ఖర్చులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'బీమా సుగమ్' (Bima Sugam) డిజిటల్ ప్లాట్ఫారమ్ కూడా ఇన్సూరెన్స్ అమ్మకాల్లో కీలక పాత్ర పోషించనుంది. రాబోయే త్రైమాసికాల్లో కంపెనీల ఎక్స్పెన్స్ రేషియోలు (Expense Ratios) ఎలా ఉండబోతున్నాయి అనేది, వీటి లాభదాయకతను నిర్ధారించే ప్రధాన అంశంగా మారనుంది.
