దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆగష్టు 5, 2026 న అప్రమత్తంగా కన్సాలిడేషన్ దశలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ ఫలితం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ముడి చమురు ధరలు తగ్గడం కొంత ఊరటనిచ్చినా, నాలుగు రోజుల ర్యాలీ తర్వాత వచ్చిన ప్రాఫిట్-బుకింగ్ కారణంగా నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. F&O స్టాక్స్కు కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ను కూడా మార్కెట్ పార్టిసిపెంట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారు.
RBI పాలసీపైనే మార్కెట్ ఫోకస్
ఆగష్టు 5, 2026 న భారత స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ దశలో కదులుతున్నాయి. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఆగష్టు 3 న ఐదు నెలల గరిష్ట స్థాయి 24,774 కి చేరిన నిఫ్టీ 50, ఆగష్టు 4 న 24,615 వద్ద ముగిసింది. ఇటీవల వచ్చిన ర్యాలీలో లాంగ్ పొజిషన్స్ తీసుకున్న ట్రేడర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడమే ఈ కరెక్షన్ కి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
వడ్డీ రేట్లపై సందిగ్ధత
కేంద్ర బ్యాంక్ ఈరోజు ప్రకటించనున్న పాలసీ, మార్కెట్ సెంటిమెంట్ను నడిపించే కీలక అంశం. వడ్డీ రేట్ల భవిష్యత్ trajectry, లిక్విడిటీ పరిస్థితులపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇవి బ్యాంకింగ్ రంగ స్టాక్స్పై, మొత్తం మార్కెట్పై ప్రభావం చూపుతాయి. 58,500 రెసిస్టెన్స్ లెవెల్ ను దాటడానికి ప్రయత్నిస్తున్న బ్యాంక్ నిఫ్టీ కూడా, అధికారిక ప్రకటనకు ముందు పెద్దగా రిస్క్ తీసుకోకుండా జాగ్రత్త పడుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై రెగ్యులేటర్ వైఖరిని అర్థం చేసుకున్న తర్వాతే కొత్త పెట్టుబడులు పెట్టాలని మార్కెట్ పార్టిసిపెంట్స్ భావిస్తున్నారు.
ముడిచమురు, కొత్త ట్రేడింగ్ డైనమిక్స్
దేశీయ పాలసీ అనిశ్చితి ప్రధానంగా ఉన్నప్పటికీ, బాహ్య కారకాలు మిశ్రమ సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిణామాలపై ఆశాభావంతో బ్రెంట్ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. భారతదేశం ముడి చమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే దేశం కాబట్టి, తక్కువ ధరలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలంగా ఉంటాయి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, స్వల్పకాలిక టెక్నికల్ సెల్లింగ్ ప్రెషర్ ఈ సానుకూలతను కొంతవరకు అడ్డుకుంటోంది.
అంతేకాకుండా, ఆగష్టు 3, 2026 నుండి F&O సెగ్మెంట్కు అమలులోకి వచ్చిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) ప్రభావాన్ని కూడా ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. ఈ కొత్త యంత్రాంగం, డెరివేటివ్స్లో ఎండ్-ఆఫ్-డే వోలటాలిటీని తగ్గించి, ధరల ఆవిష్కరణను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. మార్కెట్ ముగింపు విధానంలో వచ్చిన ఈ మార్పు కారణంగా, గత టెక్నికల్ ప్యాటర్న్లను కొత్తగా అర్థం చేసుకోవాల్సి రావచ్చు. ప్రస్తుతం ఇండెక్స్ కీలక మూవింగ్ యావరేజ్ల పైన ట్రేడ్ అవుతోంది, కానీ RBI పాలసీ ప్రకటనకు మార్కెట్ ఎలా స్పందిస్తుందో, రాబోయే సెషన్లలో కీలక సపోర్ట్ స్థాయిలను నిలబెట్టుకోగలదో లేదో అనేదానిపై తక్షణ ట్రెండ్ ఆధారపడి ఉంటుంది.
