RBI నిర్ణయంపై బ్యాంకుల వ్యతిరేకత
కేంద్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల దేశీయ ఫారెక్స్ (Forex) పొజిషన్లపై విధించిన $100 మిలియన్ పరిమితిపై భారతీయ బ్యాంకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త, కఠినమైన నిబంధనలపై తమ అభ్యంతరాలను తెలియజేయడానికి బ్యాంకుల సీనియర్ ట్రెజరీ అధికారులు వారాంతంలో RBI ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నియమాల వల్ల తమ లాభాలపై పడే ప్రభావాన్ని గురించి వారు వివరించారు.
ప్రస్తుతం తమ దగ్గరున్న ఫారెక్స్ పొజిషన్లను తగ్గించుకోవడానికి వెంటనే కాకుండా, కొంత సమయం ఇవ్వాలని బ్యాంకులు RBIని కోరుతున్నాయి. వాస్తవానికి, ప్రతి బ్యాంకుకు దాదాపు $250 మిలియన్ నుంచి $300 మిలియన్ వరకు ఇప్పటికే పొజిషన్లు ఉన్నాయని సమాచారం.
రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే RBI ఈ రూల్
ఇటీవల భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోయి, దాదాపు 94.81 వద్ద ట్రేడ్ అవుతోంది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకే RBI ఈ పరిమితిని విధించింది. అంతకుముందు, బ్యాంకులు తమ మొత్తం క్యాపిటల్ లో 25% వరకు నెట్ ఓపెన్ ఫారెక్స్ పొజిషన్లను ఉంచుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని $100 మిలియన్ కి కుదించారు.
కొత్త పరిమితుల వల్ల మార్కెట్ పై ప్రభావం
ఒకవేళ ఈ $100 మిలియన్ పరిమితిని అనుకున్నట్లుగా ఏప్రిల్ 10 నాటికి అమలు చేస్తే, భారతీయ బ్యాంకులు సుమారు $10 బిలియన్ నుంచి $18 బిలియన్ వరకు తమ డాలర్ హోల్డింగ్స్ ని మార్కెట్ లో అమ్మకానికి పెట్టాల్సి వస్తుంది. ఈ బలవంతపు అమ్మకాల వల్ల 'మార్క్-టు-మార్కెట్' ట్రేడింగ్ లో భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. ఈ నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q4FY26 లో నమోదై, నేరుగా ట్రెజరీ ఆదాయాన్ని తగ్గిస్తాయి.
అంతేకాకుండా, కరెన్సీ ఆర్బిట్రేజ్ ద్వారా బ్యాంకులు సంపాదించే అవకాశాలు కూడా పోతాయి. విదేశీ మార్కెట్లలో ( Offshore markets) ఇలాంటి పరిమితులు లేకపోవడంతో, ట్రేడర్లు రూపాయి విలువ పడిపోతుందనే ఊహతో పెట్టుబడులు పెట్టే (bearish bets) అవకాశం ఉంది. దీనివల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు కరెన్సీ హెడ్జింగ్ ఖర్చులు పెరిగి, ఆన్షోర్, ఆఫ్షోర్ ఫారెక్స్ మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసం కూడా పెరగనుంది.